Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమర్ఖాలిద్పై దాడి చేసిన దుండగుల ఫేస్బుక్ పోస్ట్!
న్యూఢిల్లీ: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు పలుమార్లు హెచ్చరించినా అది కొందరు దుండగుల చెవికెక్కడం లేదు. పైగా దాడి చేసింది తామేనని బహిరంగంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. తాజాగా జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్పై దాడి.. భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ బహుమతి అని పేర్కొంటున్న ఓ వీడియోను ఆ దాడికి పాల్పడిన దుండగులు ఫేస్బుక్లో పోస్టు చేశారు. అంతేకాదు, దేశంకోసం ఈ దాడికి పాల్పడ్డారని దర్వేశ్ షాపూర్, నవీన్ దలాల్గా పరిచయం చేసుకున్న ఆ ఇద్దరు చెప్పుకొచ్చారు. జేఎన్యూ గ్యాంగ్లాంటి పిచ్చివాళ్లని శిక్షించేందుకు రాజ్యాంగంలో చట్టం లేదని, ఇలాంటివారికి గుణపాఠం చెప్పాలని తమ పెద్దలు తమకు నేర్పారని వారు అందులో వివరించారు. పంద్రాగస్టున ఈ పోస్టు పెట్టిన ఇద్దరికోసం పోలీసులు గాలింపులు మొదలుపెట్టారు.