Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం కాదన్న సుప్రీంకోర్టు
ఢిల్లీ: అస్సాంలో తుది జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) విడుదలకు గడువును నిర్ణయించేది తామేనని.. ప్రభుత్వం కాదని సుప్రీంకోర్టు గురువారం స్పష్టం చేసింది. అదేవిధంగా ఎన్ఆర్సీ ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలు, అభిప్రాయాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనకూ న్యాయస్థానం కాలపరిమితిని విధించింది. దీనికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ)ని కేంద్రం ఈనెల 14న కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రంజన్ గొగొరు, నవీన్ సింహా, కె.ఎం.జోసెఫ్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్ఆర్సీ ముసాయిదా విధివాధానాల్లో పేర్కొన్న కాలపరిమితులు చెల్లబోవని.. వీటిపై రాబోయేరోజుల్లో న్యాయస్థానమే నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం తెలిపింది. ముసాయిదా అభ్యంతరాలు, అభిప్రాయాలపై వచ్చే దరఖాస్తుల విషయంలో ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి వాదనలు వింటామని.. దాని తర్వాతే వాటి పరిష్కారం కోసం కాలపరిమితిని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 30 నుంచి ముసాయిదాపై వచ్చే అభ్యంతరాలను,అభిప్రాయాలను స్వీకరిస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు కోర్టు సమ్మతించింది. దీనిపై తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 28కు వాయిదా వేసింది.