Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిట్ దర్యాప్తులో గౌరీలంకేశ్ హత్య కేసు నిందితుడి వెల్లడి
బెంగళూరు : గౌరీలంకేశ్ హత్యకేసులో ప్రధాన నిందితుడు పరశురాం వాఘ్మేర్ను గౌరీ ఇంటికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన ఆరోపణలతో అరెస్టయిన గణేశ్ మిస్కిన్.. ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణలో కీలకాంశాలను వెల్లడించాడు. ప్రముఖ హేతువాది ఎంఎం కాల్బుర్గీ హత్యలోనూ తన ప్రమేయమున్నట్టు మిస్కిన్ అంగీకరించాడు. 2015లో కాల్బుర్గీని హతమార్చేందుకు తన ఇంటికి వెళ్లినవారిలో తనూ ఉన్నాడని వివరించాడు. గౌరీ హత్యలో మాస్టర్ మైండ్ అమోల్ కాలే.. కాల్బుర్గీ మర్డర్లోనూ ప్రధాన పాత్రపోషించాడని తెలిపాడు. అమోల్ కాలే తన మిత్రుడు అమిత్ దేగ్వెకర్లు కలిసి మహారాష్ట్ర, కర్నాటకలోని హేతువాదులను హతమార్చిన కుట్రలో భాగస్వాములని మిస్కిన్ వెల్లడించాడు.