Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్లో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు
భోపాల్: స్వాతంత్రోద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీ ప్రతిమ పక్కనే ఆయన హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న వీర్ సావర్కర్ బొమ్మను ఉంచడం వివాదాస్పదమైంది. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకెళ్తే... స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని భోపాల్లో దేశానికి స్వతంత్య్రం కోసం పోరాడిన వ్యక్తుల ప్రతిమలను నగరమంతా ప్రతిష్టించారు. అలాగే గవర్నర్ ఇంట్లో కూడా ఏర్పాటుచేశారు. అయితే, గాంధీ బొమ్మను ఆనుకుని వి.డి. సావర్కర్ బొమ్మను కూడా ఉంచారు. కాగా, భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ బొమ్మను మాత్రం ఎక్కడా పెట్టలేదు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీని చంపిన కేసులో నాథూరాం గాడ్సేతో పాటు సావర్కర్ హస్తం కూడా ఉందని ఆరోపణలున్నాయి. (తరువాత కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది) ఆయనేనాడూ స్వతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని, 1942 లో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఫోటోను మహాత్ముడి పక్కన ప్రతిష్టించడం గాంధీని అవమానిం చడమే అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది అన్నారు. తమకు అవకాశం ఉన్న చోట్లలో హిందూత్వాన్ని ప్రచారం చేయడానికే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడు తోందని ఆయన ఆరోపించారు. దీనిపై బీజేపీ స్పంది స్తూ.. తాము కావాలని చేయలేదని, కాంట్రాక్టరు తప్పిదం వల్ల పొరపాటు జరిగిందని బుకాయించింది. ఈ యేడాది మే 19 న గాడ్సే పుట్టినరోజున గ్వాలియర్లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించడం, జయంతి సంబరాలు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసిన విషయం విదితమే.