Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి
- బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఐక్యం : 'సాంఝీ విరాసిత్ బచావో సమ్మేళన్'లో రాహుల్గాంధీ
- రానున్న అన్ని ఎన్నికల్లో ఓడిస్తామని దీమా
నవతెలంగాణ-న్యూఢిల్లీబ్యూరో
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తున్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. భారతీయ ఎన్నికల కమిషన్పై కూడా ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల కాలంలో ఉన్నత విద్యాసంస్థలపై బీజేపీ సర్కారు దాడిని తీవ్రతరం చేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల యుద్ధంలో విపక్ష పార్టీలన్నీ కలిసి బీజేపీ సర్కారును ఓడించాలని పిలుపునిచ్చారు. లోక్తాంత్రిక్ జనతా దళ్ పార్టీ అధినేత శరద్యాదవ్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో నిర్వహించిన 'సాంఝీ విరాసత్ బచావో సమ్మేళన్'లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీతో పాటు సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డితో పాటు మొత్తం 15 విపక్ష పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును ఓడించేందుకు విపక్షాలు ఐక్యంగా ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు రాహుల్గాంధీ చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకంగా దేశంలో విభిన్న సంస్కృతులపై విశ్వాసం ఉన్న పార్టీలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాహుల్గాంధీ మాట్లాడుతూ.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఐకమత్యంగా ఉన్నాయని చెప్పారు. త్వరలో జరిగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాలతో పొల్చితే తమ(విపక్ష పార్టీల) సిద్ధాంతం బలంగా ఉందని అన్నారు. ఈ సిద్ధాంతమే బీజేపీ ఓడిస్తుందని చెప్పారు. అంతకుముందు శరద్యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీ హయాంలో రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ఆందోళనవ్యక్తం చేశారు. 'రాజ్యాంగం దేశంలోని విభిన్న సంస్కృతులకు అద్ధంపడుతుంది. అందువల్లే రాజ్యాంగం మాకు గీత, ఖురాన్లా పవిత్రమైంది. ఈ ఆలోచనా విధానం కలిగిన పార్టీలన్నీ ఏకం కావాలి. అప్పుడే దేశంలోని విభిన్నసంస్కృతులను కాపాడగలం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్తో పాటు ధర్మేంద్రయాదవ్(ఎస్పీ), జైప్రకాష్నారాయణ్(ఆర్జేడీ), చందన్మిత్రా(తృణమూల్), తిరుచ్చి శివ(డీఎంకే), తారీఖ్ అన్వర(ఎన్సీపీ),ఫారూఖ్ అబ్ధుల్లా(ఎన్సీ) తదితరులు పాల్గొన్నారు.