Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మూడు సార్లలో చివరిసారి మాత్రమే ఆయన ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం అధికారంలో కొనసాగింది. అధికారంతో సంబంధం లేకుండా వాజ్పేయి భారత రాజకీమాల్లో గుర్తింపు సాధించారు. సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా ఆయన కొనసాగారు
వాజ్పేయి తన సోదరుడితో కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 23 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొనబోమని హామీ పత్రం రాసివ్వడంతో ఆయన్ను అప్పటి ప్రభుత్వం విడుదల చేసింది. ఆయన ఆ హామీని తరువాత కూడా నిలుపుకోవటం గమనార్హం. 1948లో మహాత్ముడి హత్య నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం ఆరెస్సెస్పై నిషేధం విధించింది. దీనితో దీన్దయాల్ ఉపాధ్యాయతో కలిసి ఆయన 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఫ్ులో చేరారు. తరువాత ప్రధాన కార్యదర్శిగా నియమితులై ఢిల్లీ కేంద్రంగా ఉత్తర ప్రాంత పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఆయన శ్యామప్రసాద్ ముఖర్జీ అనుచరుడిగా మారారు. 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బలరామ్ పూర్ నుండి విజయం సాధించారు. తన అసాధారణ వాక్పటిమతో జనసంఫ్ులో అగ్రనేతగా ఎదిగిన వాజ్పేయి 1968లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యారు. 1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకించినందుకు ఇతర ప్రతిపక్ష నేతలతో పాటు వాజ్పేయిని కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 1977 సాధారణ ఎన్నికల్లో జనసంఫ్ు, ఇతర రాజకీయ పార్టీల విలీనంతో ఏర్పడిన జనతాపార్టీ విజయం సాధించటంతో అప్పటి మొరార్జీ దేశారు క్యాబినెట్లో వాజ్పేయి విదేశాంగ మంత్రిగా బాధ్యతలుస్వీకరించారు. ఐక్యరాజ్యసమితిలో హిందీలో ప్రసంగించిన తొలి నేతగా ఆయన రికార్డులకెక్కారు.
1980లో ఏర్పాటైన తరువాత ఆయన తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జరిగిన 1984 ఎన్నికల్లో బీజేపీ లోక్సభలో రెండు స్థానాలు మాత్రమే పొందగలిగింది. రామజన్మభూమి వివాదం తెరమీదకు వచ్చాక 1996 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికసంఖ్యలో స్థానాలు సాధించింది. దేశ ప్రధానిగా వాజ్పేయి మొదటిసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే లోక్సభలో బలం చాలకపోవటంతో 13 రోజులకే ప్రభుత్వం కుప్పకూలింది. 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ లోక్సభలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీనితో ఎన్డీయే సారధ్యంలో వాజ్పేయి మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అన్నా డీఏంకే అవిశ్వాస తీర్మానం పార్లమెంట్ ఆమోదం పొందటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 13 నెలల తరువాత 1999లో ఆయన రాజీనామా చేశారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల అనంతరం ఎన్డీయే పూర్తి ఆధిక్యతతో మెజార్టీ సాధించటంతో వాజ్పేయి మరోసారి ప్రధాని పగ్గాలు చేపట్టి 2004 వరకూ పూర్తి కాలం పదవిలో కొనసాగారు.
ప్రధానిగా ఆయన హయాంలో మన దేశం 1998 మేలో ఐదు భూగర్భ అణు పరీక్షలు నిర్వహించింది. 1998-99లో పాకిస్తాన్తో పూర్తి స్థాయి శాంతి దౌత్యాన్ని వాజ్పేయి నిర్వహించారు. 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ -లాహోర్ బస్సు సర్వీసును ప్రారంభించారు. వాజ్పేయి హయంలోనే కార్గిల్ యుద్దం జరిగింది. 1999లో మూడో సారి ఆయన ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. 2001లో పార్లమెంట్పై జరిగిన ముష్కర దాడి జరిగింది, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేసేందుకు వాజ్పేయి ప్రభుత్వం అమలులోకి తెచ్చిన టాడా చట్టం దుర్వినియో గమవుతోందంటూ అనేక విమర్శలను ఎదుర్కొంది. 2001లో డిసెంబర్లో జరిగిన అయోధ్య శిలాదాన్ కార్యక్రమం, 2002 ఫిబ్రవరిలో జరిగిన గుజరాత్ రైలు దగ్ధం, అనంతర ఘర్షణలు, వాటిపై వాజ్ పేయి మౌనం దాల్చారు. 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే కూటమి ఓటమి పాలు కావటంతో, వాజ్పేయి అధికారంతో పాటు క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరమయ్యారు. 2015లో కేంద్ర ప్రభుత్వం వాజ్పేయికి భారతరత్న ప్రకటించింది.