Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిహద్దుల్లో హైఅలెర్ట్
శ్రీనగర్: పాకిస్తాన్ బలగాలు మరో దుశ్చర్యకు పాల్పడ్డాయి. సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్ గొంతు కోసి అతి కిరాతకంగా హత మార్చాయి. అంతర్జాతీయ సరిహద్దులోని రామ్గఢ్ సెక్టార్లో ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దీంతో సరిహద్దులు, నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట భద్రతా అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనపై బీఎస్ఎఫ్... పాక్ రేంజర్లకు ఫిర్యాదు చేసింది. హత్యకు గురైన బీఎస్ఎఫ్ జవాన్ను హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర కుమార్గా గుర్తించారు. అతడి మృతదేహంలో మూడు బుల్లెట్ గాయలు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయం తప్పిపోయిన నరేంద్ర కుమార్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించాలని భావించిన భద్రతా బలగాలు, పాక్ సైన్యాన్ని సహకారం కోరగా... సాకులు చెబుతూ జాయింట్ సెర్చ్ ఆపరేషన్కు అంగీకరించలేదు. దీంతో సాయంత్రం భారత బలగాలు ఒంటరిగానే 'రిస్కీ ఆపేరేషన్' చేపట్టి జవాన్ మృత దేహాన్ని బయటకు తీసుకొచ్చాయి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.