Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్: ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజె క్టుకు ఆది నుంచీ ఎదురు గాలి వీస్తోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతి రేకంగా ఇప్పటికే గుజరాత్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కాగా తాజాగా మరో 1000 మంది రైతులు వేర్వేరు అఫిటవిట్లు ధాఖలు చేశారు. కాగా చీఫ్ జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ విఎం పంచోళిలతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్... ఈ ప్రాజెక్టు సంబంధిచి భూ సేకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది నష్టపోతారని, భూ సేకరణకు తాము అంగీకరించేది లేదని పిటిషనర్లు పేర్కొన్నారు. కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములను వదులుకోబోమని గుజరాత్లోని వివిధ జిల్లాలకు చెందిన బాధిత రైతులు అఫిడవిట్లలో స్పష్టం చేశారు.