Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ బృందం
న్యూఢిల్లీ: సంచలనంగా మారిన రాఫెల్ డీల్ వివాదం కాగ్ వద్దకు చేరింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)ను బుధవారం కలుసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్, ముకుల్ వస్నిక్, ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, రణ్దీప్ సూర్జేవాలా, రాజీవ్ శుక్లా, వివేక్ టంకాలతో కూడిన బృందం కాగ్ రాజీవ్ మహర్షితో సమావేశమై మెమోరండాన్ని అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... 'రాఫెల్ ఒప్పందంపై పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని కాగ్కు సమర్పించాం.
తొందర్లోనే దీనిపై విచారణ ప్రారంభిస్తారని ఆశిస్తున్నాం' అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ వెల్లడించారు. కాగా రాఫెల్ ఒప్పందంపై పూర్తి వివరాలు, ఆధారాలను సమర్పించామని, ఇప్పటికే ఈ వ్యవహారంపై దృష్టిసారించామని కాగ్ వెల్లడించినట్టు మరో సీనియర్ నేత రణ్దీప్ సూర్జేవాలా తెలిపారు.