Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఎయిర్సెల్- మాక్సిస్ ఒప్పందం కేసు దర్యాప్తుకు తుదిగడువును మూడు నెలలు పొడిగిస్తూ సుప్రీంకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఈ గడువులోగా విచారణ పూర్తి చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను జస్టిస్ ఎ.కె.సిక్రి, అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొందరు నిందితులను విచారించడంతో పాటు కొన్ని ఈ-మెయిల్స్ను కూడా పరిశీలించాల్సి ఉందని, దర్యాప్తు పూర్తి చేయడానికి మరికొంత సమయం కావాలని ఇడి తరుపున అదనపు సొలిసిటర్ తుషార్ మెహతా కోరగా కోర్టు ఈ మేరకు గడువునిచ్చింది. ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గత మార్చిలో ఈడీికి కోర్టు ఆరు నెలల గడువును ఇచ్చిన సంగతి తెలిసిందే.