Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన తండ్రే తన కూతురుపై గత నాలుగేండ్ల పాటు అకృత్యానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకు న్నారు. పోలీసుల వివరాల ప్రకారం... థానే నగరంలోని కసర్వాడావ్లీ ప్రాంతానికి చెందిన బాలిక తల్లిదండ్రులు విడిపోవడంతో ఆమె గత ఏడేండ్లుగా తండ్రి దగ్గర ఉంటోంది. కాగా గత నాలుగేండ్లుగా బాలిక తండ్రి ఆమెపై లైంగిక దాడికి ప్పాల్పడుతున్నాడు. దీంతో అతని అకృ త్యాలను భరించలేక ఆ చిన్నారి పొరుగున ఉన్న వారితో తన గోడును వెల్లబోసుకుంది. వారి సహా యంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేశారు.