Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో విద్యార్థినితో ఇద్దరు కీచక ప్రొఫెసర్ల అసభ్య ప్రవర్తన
ముంబయి: పాఠాలు బోధించి విద్యా బుద్దులు నేర్పాల్సిన ఇద్దరు ఉపాధ్యాయులు ఓ విద్యార్థిని పట్ల కీచకులుగా మారారు. పరీక్ష పాస్ కావాలంటే తమ కోరిక తీర్చాలని 12వ తరగతి చదువుతున్న విద్యార్థిని(19)పై వేధింపులకు పాల్పడ్డారు. మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలోని ఓ ప్రయివేటు కాలేజీలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. నాసిక్లోని ఓ ప్రయివేటు కాలేజీలో 12 తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇద్దరు ప్రొఫెసర్లు.. ప్రవీణ్ సూర్యవంశి, సచిన్ సోనావానేలు 2015 నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. విద్యార్థిని చేతిని పట్టుకోవడం, ఆమె దేహాన్ని అసభ్యకరంగా తడుముతుండేవారు. 12వ తరగతిలో పాస్ కావాలనుకుంటే తమ కోరిక తీర్చాలని బలవంతపెట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఒక ప్రొఫెసర్ ఆ విద్యార్థినిని సమీపించి చేతిని పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించసాగాడు. దీంతో ఓపిక నశించిన సదరు విద్యార్థిని ఇంటికెళ్లి తల్లిదండ్రులతో విలపిస్తూ విషయం చెప్పింది. ఆమె తల్లిదండ్రులు అద్గావ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. నిందితులపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.