Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు దర్యాప్తులో భాగంగా కర్నాటక సిట్.. వాసుదేవ్ సూర్యవంశిని అదుపులోకి తీసుకోబోతున్నట్టు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. మహారాష్ట్రలో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రపన్నిన కేసులో పలువురు హిందూత్వ అతివాదులు సహా వాసుదేవ్ సూర్యవంశి(29)నీ జల్గావ్లో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ నెల 25 వరకు ఏటీఎస్ అదుపులోనే ఉండనున్నాడు. గౌరీ లంకేశ్ హత్య కోసం రెక్కీ నిర్వహించినప్పుడు ఉపయోగించిన ద్విచక్రవాహనాన్ని సూర్యవంశినే డిస్పోజ్ చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని కర్నాటక సిట్కు తెలియజేశారని, త్వరలోనే నిందితుడు వాసుదేవ్ సూర్యవంశిని అదుపులోకి తీసుకునే అవకాశమున్నదని ఓ పోలీసు అధికారి తెలిపారు. జల్గావ్లో ఎనిమిదేండ్లనుంచి నివసిస్తున్న సూర్యవంశి అక్కడే ఓ గ్యారేజీని నడుపుతున్నాడు. సూర్యవంశిని విచారించగా.. హిందూత్వ అతివాదులు ఉపయోగించిన రెండు కార్లు, ఆరు ద్విచక్రవాహనాల వివరాలు తెలిసాయని పోలీసు వర్గాలు వివరించాయి.