Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వచ్చే వారంలో సమావేశం కానున్నారు. న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇరువురు విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరగాలని కోరుతూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖకు స్పందిస్తూ భారత విదేశాంగ శాఖ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. 'పాకిస్తాన్ విజ్ఞప్తిని మేం అంగీకరిస్తున్నాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విదేశాంగ మంత్రులు సమావేశమవుతారు' అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. సమావేశం తేదీ, సమయాన్ని త్వరలో నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇరుదేశాల మంత్రులు సమావేశం కావడం ఇదే మొదటిసారి.
అయితే ఈ సమావేశాన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక సమావేశంగా కూడా చూడకూడదని రవీష్ కుమార్ తెలిపారు. 'ఇది కేవలం సమావేశం మాత్రమే. ఇరు దేశాల మధ్య చర్చలు, సంభాషణల పున:ప్రారంభంగా చూడకూడదు' అని అన్నారు. 2016లో యూరిలో ఉగ్రవాదుల దాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగడం లేదు.
అలాగే త్వరలోనే జరిగే సమావేశంలో కర్తార్పూర్ కారిడర్ అంశాన్ని సుష్మా స్వరాజ్ ప్రస్తావించే అవకాశం ఉందని రవీష్ కుమార్ తెలిపారు. పాకిస్తాన్లోని కర్తార్పూర్లోని గురుద్వారను సందర్శించడానికి భారత యాత్రీకులకు అనుమతి ఇవ్వాలని భారత్ గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోంది. ఇక్కడ గురునానక్ సమాధి ఉంది. 2019లో గురునానక్ 550 జయంతి సందర్భంగా ఈ గురుద్వారను సందర్శించడానికి అనుమతి ఇవ్వాలని ఇటీవల పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా పాక్కు విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై భారత్తో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ఈ నెల 13న పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.