Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్సిటీలకు యూజీసీ ఆదేశం
న్యూఢిల్లీ: ఈ నెల 29న దేశంలోని విశ్వ విద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు 'సర్జికల్ స్ట్రైక్ డే' ని నిర్వహిం చాలని యూజీసీ ఆదేశిం చింది. రెండేండ్ల క్రితం సెప్టెంబర్ 29న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రవే శించిన భారత సైన్యం ముష్కరులను మట్టుబెట్టింది. దీనికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించాలని యూజీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఆర్మీ అధికారుల గురించి విద్యార్థులకు మాజీ సైనికులతో ప్రసంగాలు ఇప్పించాలని ఆదేశించింది. ప్రత్యేక పరేడ్లు నిర్వహించి, ఆర్మీకు మద్దతు తెలిపేలా గ్రీటింగ కార్డులు పంపించాలని తెలిపింది. ఎన్సీసీ విభాగాలు ప్రత్యేక పరేడ్లు నిర్వహించి, దేశ రక్షణ కోసం సైనికులు అవలంభించే విధానాలను విద్యార్థులకు తెలపాలని ఆదేశించింది. ఆ రోజున ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సైనికుల త్యాగాలను తెలిపేలా మల్టీమీడియా ప్రదర్శన ఏర్పాటు చేస్తామని, ఈ కార్యక్రమం రాష్ట్రాల్లోనూ ఉంటుందని యూజీసీ తెలిపింది.