Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయలలిత మృతిని దర్యాప్తు చేస్తున్న కమిషన్కు అపోలో వివరణ
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత చికిత్స పొందుతున్నప్పటి సీసీటీవీ ఫుటేజీ ఆటోమేటిక్గా డిలీట్ అయిందని ఆమె మృతిపై దర్యాప్తు చేస్తున్న ఎ అరుముగస్వామి కమిషన్కు అపోలో ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. 2016 సెప్టెంబర్ 22న ఆమె ఆస్పత్రిలో చేరడానికి దారితీసిన పరిస్థితులు, 2016 డిసెంబర్ 5న చనిపోయేంతవరకు ఆమెకు అందించిన చికిత్స గురించి ఎ అరుముగస్వామి కమిషన్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఆస్పత్రిలోని సీసీటీవీ రికార్డింగ్స్ 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుందని, తర్వాత మళ్లీ కొత్త చిత్రాలు రికార్డ్ అవుతాయని అపోలో ఆస్పత్రి కౌన్సెల్ మైమూనా బాద్షా తెలిపారు.
ఈ విధానం అమల్లో ఉండటం వల్ల 2016 సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 మధ్య జయలలిత చికిత్స పొందుతున్నప్పుడు రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని అందజేయలేమని కమిషన్కు వివరించారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 11న కమిషన్కు తెలిపామని అపోలో ఆస్పత్రి కౌన్సెల్ మైమూన బాద్షా చెప్పారు. కాగా, సీసీటీవీలు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయని ఆపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ ప్రతాప్ సి రెడ్డి గతంలో ఇచ్చిన సేట్మెంట్పై ప్రశ్నించగా అది వేరే విషయమని బాద్షా అన్నారు.