Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రయాణికుల చెవులు, ముక్కు నుంచి రక్తస్రావం
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్ సిబ్బంది నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాల మీదకు తెచ్చింది. విమానం బయలుదేరే ముందు క్యాబిన్ ఎయిర్ ప్రెజర్ను నియంత్రించడంపై నిర్లక్ష్యంగా ఉండటంతో ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. కొంత మంది ముక్కు, చెవుల నుంచి రక్తస్రావం కాగా, మరికొందరు తీవ్ర తలనొప్పితో ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం ముంబయి నుంచి జైపూర్కు బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ 9డబ్ల్యూ 697 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే విమానం టేక్ఆఫ్ సమయంలో 'బ్లీడ్ స్విచ్'ను ఆన్ చేయడాన్ని ఫైలెట్ మర్చిపోవడంతో ఇది జరిగినట్టు తెలుస్తోంది. వెంటనే ఆక్సిజన్ మాస్క్లు రిలీజ్ కావడంతో ప్రయాణికులు వాటిద్వారా గాలి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని ముంబయి ఎయిర్పోర్టుకు మళ్లించి అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించారు. విమానంలో దాదాపు 166 మంది ప్రయాణికులండగా వారిలో 30 మంది వరకు అస్వస్థత చెందారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారులు తెలిపారు. పైలెట్ నిర్లక్ష్యంగా ఉండటం మూలానే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎయిర్క్రాఫ్ట ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) కాగా ఈ ఘటనపై వెంటనే నివేదిక సమర్పించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డీజీసీఏను ఆదేశించింది.