Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆవును 'రాష్ట్రమాత'గా ప్రకటించింది. ఈ మేరకు ప్రవేశ పెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఆమో దం తెలిపింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదం కొరకు ఢిల్లీకి పంపారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి రేఖా ఆరియా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు ఇందిరా హృదయేశ్ మాట్లాడుతూ.. ఆవును రాష్ట్రమాతగా ప్రకటించడంతో ప్రయోజనం లేదన్నారు. వాటిని రోడ్లపైకి రాకుండా చేసి సంరక్షించాలని అన్నారు. ఆవు ఆక్సిజన్ను పీల్చి, ఆక్సిజన్ను వదిలే అరుదైన జంతువని, దేశవ్యాప్తంగా ఆవులను సంరక్షించే బిల్లు రావాలని రేఖా అరియా ఆకాంక్షించారు. ఆవును రాష్ట్రమాతగా ప్రకటించిన తొలిరాష్ట్రం ఉత్తరాఖండ్.