Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులపై విరుచుకుపడిన పోలీసులు
ఇంఫాల్ : జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ప్రొఫెసర్లు, విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న మణిపూర్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై పోలీసులు బుధవారం విరుచుకుపడ్డారు. దీంతో వర్సిటీలో యుద్ధవాతావరణం నెలకొంది. తొలుత యూనివర్సిటీ క్యాంపెస్లోకి వస్తున్న పోలీసులను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో రెచ్చిపోయిన పోలీసులు విద్యార్థులపై లాఠీలు, బాష్పవాయు ప్రయోగం చేశారు. మరో పది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. వైస్ చాన్స్లర్ ఏపీ పాండే ఆర్థిక, నిర్వహణా అవకతవకలకు పాల్పడుతున్నారనీ, అతనిని తొలగించాలని డిమాండ్ చేస్తూ గత మూడు నెలలుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కాగా వీసీని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ సెలవుపై పంపింది. తాత్కాలిక వీసీగా ప్రొఫెసర్ కె యుగీంద్రోను నియమించింది. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అరెస్టు చేసిన విద్యార్థులు, ప్రొఫెసర్లను విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై పోలీసులు బుధవారం విరుచుకుపడ్డారు.