Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వచ్చేనెల 18లోగా దర్యాప్తును పూర్తి చేస్తాం
- బాంబే హైకోర్టుకు సీబీఐ వెల్లడి
ముంబయి: ప్రముఖ హేతువాది దభోల్కర్ హత్య కేసులో దర్యాప్తును వచ్చేనెల 18లోగా పూర్తి చేయడానికి సీబీఐ స్వీయ గడువును విధించు కుంది. అదేవిధంగా ఆ తేదీలోగానే ఈ కేసులో నిందితులపై చార్జీషీటు దాఖలు చేస్తామనీ బాంబే హైకోర్టుకు బుధవారం వివరించింది. సీబీఐ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటరీ జనరల్ అనిల్ సింగ్.. న్యాయ మూర్తులు ఎస్సి ధర్మాధికారి, బి.పి. కోలబవల్ల లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు. దభోల్కర్ హత్యకేసులో సీబీఐ ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. మరోపక్క, వామపక్ష భావజాల నాయకుడు గోవింద్ పన్సారే హత్యకేసులో నిందితుల సీబీఐ కస్టడీ కోసం ఎదురు చూస్తున్నామని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ధర్మాసనానికి తెలిపింది. నిందితులను వారం రోజుల్లోగా అదుపులోకి తీసుకుంటామని వివరిం చింది. పన్సారే, దభోల్కర్ హత్యకేసులపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ, మహారాష్ట్ర సీఐడీలు.. దర్యాప్తు పురోగతిపై బుధవారం నివేదికలు అందిం చాయి. కాగా, ఈ కేసులకు సంబంధించి పురోగతి నివేదికలు అందజేయాలని తెలుపుతూ తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చేనెల 22కు వాయిదావేసింది.