Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీబీఐ పిటిషన్పై విచారణకు సుప్రీం ఒకే
- ఈ నెల 12న ధర్మాసనం ముందుకు...
న్యూఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణం కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 12న దీనిపై విచారణ జరగనున్నది. హైకోర్టు తీర్పును పున:సమీక్షించాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన ఎనిమిది నెలల తర్వాత విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. 12 ఏండ్ల క్రితం ఢిల్లీ హైకోర్టు ఈ కేసును మూసివేయగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ను ఆశ్రయించిన అనంతరం కేసుపై మరోసారి విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న హిందుజా సోదరులతోపాటు మరికొందరికి సంబంధించిన తమకు మరింత సమాచారం లభించిందని, కేసుపై సత్వర విచారణ జరపాలని సీబీఐ కోరింది.