Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తరాఖండ్లోని అమ్రెV్ా జిల్లా రైతుల వినూత్న నిరసన
- మోడీ సర్కారుకు మేమేంటో చూపిస్తాం.. : అన్నదాతలు
డెహ్రాడూన్: రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న బీజేపీ సర్కారు పట్ల దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాఖండ్లో అయితే, బీజేపీ నేతలెవరూ తమ గ్రామాలకు రావడానికి వీల్లేదంటూ గ్రామ సరిహద్దుల్లో ఎక్కడికక్కడ సూచికలు (సైన్ బోర్డ్స్) ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని కిసాన్ ఘాట్లో ప్రశాంతంగా ర్యాలీ తీస్తున్న రైతులపై మోడీ సర్కారు పోలీసులతో లాఠీచార్జీ చేయించింది. ఈ ఆందోళనలో పాల్గొన్న రైతులందరూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఉత్తరాఖండ్ నుంచి గతనెల 23న ట్రాక్టర్లలో ఢిల్లీకి తరలివెళ్లారు. వీరిని ఉత్తరప్రదేశ్-ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనలో వందలాది మంది రైతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు.. టీయర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లతో రైతులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాగా, ఈ ఆందోళనలో పాల్గొన్న అమ్రెV్ా జిల్లా గ్రామాల్లోని రైతులు.. బీజేపీ సర్కారు తమపై దాడి చేయించిందని, ఆ పార్టీ నేతలెవరూ తమ గ్రామాల్లోకి అడుగుపెట్టకూడదని గ్రామ సరిహద్దుల్లో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. బోర్డులు ఏర్పాటుచేయడమే గాక.. వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో రైతులకు మద్దతు పెరుగుతోంది. ఇది ఉత్తరాఖండ్కే గాక, యోగీ ఆదిత్యనాత్ నేతృత్వం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని మొరదబాద్, సంభాల్, బిజ్నూర్ జిల్లాలకు కూడా విస్తరిస్తోంది.
అమ్రోV్ా జిల్లాలోని ఈ నెల 6న రసూల్పుర గ్రామస్తులు మొదటిసారిగా తమ గ్రామ సరిహద్దు వద్ద బోర్డును ఏర్పాటు చేశారు. తరువాత.. చజ్పుర మఫి, బకేర్పుర్ మఫి, గలీబ్పుర్ బడ, అమ్హెదా, హఫ్జీపుర్, సలార్పుర్, తదితర గ్రామాల్లోనూ పెట్టారు. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికైట్ మాట్లాడుతూ.. మోడీ సర్కారుపై రైతులలో వెల్లువెత్తుతున్న ఆగ్రహాజ్వాలలకు ఇదే నిదర్శనమన్నారు. గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేయొద్దని చెప్పినా.. తనమాట కూడా వినిపించుకోలేదని తెలిపారు. బోర్డులు పెట్టిన వెంటనే స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు వాటిని తీసివేయాలని తమపై ఒత్తిడి తెస్తున్నారని రసుల్పుర గ్రామానికి చెందిన గుర్మీత్ సింగ్ తెలిపారు. కానీ, దీనిని తాము అడ్డుకోవడంతో గ్రామానికి కరెంటు సరఫరా నిలిపివేసేలా కుట్రలు చేస్తున్నారని గుర్మీత్ అన్నారు.
మా సమస్యలు పట్టించుకోనోళ్లకి మేమెందుకు ఓట్లేయ్యాలి..?
ఫతేపూర్ చిత్ర గ్రామానికి చెందిన దన్వీర్ సింగ్ మాట్లాడుతూ.. 'గాంధీ జయంతి రోజు మేం ప్రశాంతంగా ర్యాలీ తీస్తుంటే మోడీ సర్కారు మాపై లాఠీచార్జీ చేయించింది. మేం ఏం నేరం చేశామని పోలీసులు మాపై హింసాకాండకు దిగారు. ఈ ప్రభుత్వం ఢిల్లీని ఆక్రమించుకుంది. వాళ్లు ఓట్లు అడగడానికి మా ఊరుకు రావాల్సిందే. కానీ, వారినెవరినీ మా ఊర్లోకి అడుగుపెట్టనివ్వం. మా డిమాండ్లు నెరవేర్చని ప్రభుత్వానికి మేమెందుకు ఓట్లు వేయాలి' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు త్వరలోనే మహాపంచాయతీని నిర్వహిస్తామని అన్నారు. దీని ద్వారా మోడీ సర్కారుకు తామెంటో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.