Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి ప్రచురణ
అగర్తలా : త్రిపురలో రెండవ అతి పెద్ద దినపత్రిక, గత 40ఏండ్లుగా వెలువడుతున్న దేశర్ కథ ప్రచురణను సాంకేతిక కారణాలపై నిలిపివేసిన పశ్చిమ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల పై బుధవారం త్రిపుర హైకోర్టు స్టే ఇచ్చింది. డైలీ దేశర్ కథ ట్రస్టు (డీడీకేటీ) పిటిషన్ను విచారించిన అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజరు రస్తోగి, పై ఆదేశాలు జారీ చేశారు. దీం తో గురువారం నుంచి పత్రిక వెలువడు తుందని భావిస్తున్నారు. యాజమాన్యా నికి సంబంధించిన తప్పులు కనుగొన్నామని పేర్కొంటూ పశ్చిమ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ సందీప్ మహాత్మె ఈనెల 1వ తేదీన పత్రికను మూసివేయించారు. 1978లో ఈపత్రిక ప్రచురణ ప్రారంభమైంది. డీడీకేటీ తరఫు న్యాయ వాది వికాస్ రంజన్ భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ప్రభు త్వ ఆదేశాల మేరకే జిల్లా మేజిస్ట్రేట్ చట్టాన్ని ఉల్లంఘించారని విమర్శిం చారు. మేజిస్ట్రేట్పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తాము పిటి షన్ దాఖలు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామని మాజీ అడ్వకేట్ జనరల్ భట్టాచార్య తెలిపారు. డీడీకేటీ చైర్మెన్ గౌతమ్ దాస్ మాట్లాడుతూ, త్రిపుర ప్రభుత్వం తీసుకున్న అప్రజాస్వామిక నిర్ణయాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ క్లబ్ ఆప్ ఇండియా, పలు జర్నలిస్టు సంఘాలు ఖం డించాయని చెప్పారు. కింది స్థాయిలో వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఆర్ఎన్ఐ కూడా అదే రోజు రాత్రి 10గంటలకు దినపత్రిక రిజిస్ట్రేషన్ను ఉపసంహరించుకున్నదని, ఇలా దేశంలో గతంలో ఎన్నడూ జరగలేదని దాస్ తెలిపారు. మార్చిలో బీజేపీ-ఐపీఎఫ్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వామపక్ష నేతలపై, కార్యకర్తలపై పెద్ద ఎత్తున దాడు లు జరుగుతునే వున్నాయి. దేశర్ కథ సర్క్యులేషన్ రోజుకు 45వేలకు పడి పోయిందని, వెయ్యిమంది హాకర్లు నిరుద్యోగులయ్యారని దాస్ తెలిపారు.