Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీ..
- అమరవీరుల కుటుంబాలకు ఆసరా ఏదీ?
- దళితులకు సూదిమోపే స్థలమైనా ఇచ్చారా..!
- అత్యధిక రైతుల ఆత్మహత్యలు తెలంగాణలోనే.. : అమిత్షా
నవతెలంగాణ-కరీంనగర్ ప్రతినిధి
లోక్సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఓటమి ఖాయమన్న భయం పట్టుకోవడంవల్లే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిందని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్షా అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు అవకాశమిస్తే, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సమరభేరి పేరిట కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆ పార్టీ బుధవారం ఏర్పా టు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో అనేక హామీలు గుప్పించిన టీఆర్ఎస్ ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, తగిన విధంగా నియామ కాలు చేపట్టలేదని విమర్శించారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందన్నారు. రైతుల ఆత్మహత్యలు తెలంగా ణలోనే అత్యధికంగా నమోదయ్యాయని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలది పొంతన లేని కూటమని విమర్శించారు. ఎస్సీని చేస్తానంటూ కేసీఆర్ తానే పీఠమెక్కారని గుర్తు చేశారు. మూడెకరాల సాగుభూమి ఇస్తానంటూ, సూదిమోపే స్థలమైనా ఇవ్వ కుండా 7లక్షల ఎస్సీ కుటుంబాలను ఆయన మోసం చేశారని ఆరోపించారు. డబుల్ బెడ్రూంల ఇండ్లు 5వేలకు మించలేదన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. మిషన్ కాకతీయకు రూ.1,500 కోట్లు వెచ్చించినా, తగిన ఫలితం కనిపించడంలేదని బీజేపీ అధ్యక్షుడు గరమయ్యారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, ఎవరికి కోత విధిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. 150 రకాల హామీలను అమలు చేయని టీఆర్ఎస్కు తగిన గుణ పాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కొడుకు, కూతురు కోసమే..
ఆరు నెలల ముందే ఎన్నికలకు అసలు కారణమేంటో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి తీరాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా డిమాండ్ చేశారు. దీనిపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ నోరెందుకు మెదపడంలేదని నిలదీశారు. 9లోక్సభ నియోజక వర్గాల పరిధిలోని పోలింగ్ బూత్ లెవెల్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల బాధ్యులతో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ బుధవారం నిర్వ హించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. కొడుకు, కూతురు కోసమే చంద్రశేఖర్రావు ఇప్పుడు అనవసర ఎన్నికలకు తెరలే పారని మండిపడ్డారు. కేసీఆర్ వల్ల రూ.2,100 కోట్ల అదనపు ఎన్నికల వ్యయ భారం ఖజానాపై పడిందని ధ్వజమెత్తారు.
ఆ సొమ్ముతో కొత్తగా స్కూళ్లు, దవాఖానాలు వంటివి సమకూరేవన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 16,597 కోట్లు మాత్రమే తెలంగాణకు ఇచ్చారని అమిత్షా ప్రస్తావించారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.1,15,605 కోట్లు రాష్ట్రానికి కేటాయించింద న్నారు. మిగులు బడ్జెట్తో తెలంగాణను అప్పగిస్తే రూ.2 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి దించారని విమర్శించారు. బాబాల మాయలో పడి సచివాల యానికే రావడం మానేసిన ముఖ్యమంత్రి, తెలం గాణను ఎట్లా ముందుకు తీసుకెళ్తారని ప్రశ్నించారు. పేదల కోసం రూ. 5 లక్షల ఆరోగ్య బీమాకు ప్రధాని ప్రవేశపెడితే, రాష్ట్రంలో కేసీఆర్ అమలు కానీయడం లేదని తప్పుబట్టారు. మోడీకి ఇక్కడి ప్రజల్లో పేరొ స్తుందనే అడ్డు పడ్డారని ఆరోపించారు. ఓవైసీతో జతకట్టిన కేసీఆర్ ఆటల్ని సాగనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. బూత్ స్థాయి శ్రేణులు పార్టీ సూచించిన 23 అంశాల్లో పట్టు సాధిస్తే, ఇతర రాష్ట్రాల మాదిరే తెలంగాణలోనూ బీజేపీని అధికారంలోకి తేగలనం టూ అమిత్షా ధీమా వెలిబుచ్చారు. దేశమే ఆశ్చర్య పోయేలా ఇక్కడ కీలక పాత్ర మనదేనంటూ అరగం ట ప్రసంగంలో పార్టీ యంత్రాంగానికి బీజేపీ చీఫ్ వివరించారు.
పోగేసిన నల్లధనంతో మళ్లీ గెలవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ల నిజస్వరూపాన్ని ప్రజలకు వివరించాలని బూత్ స్థాయి నాయకులకు పిలుపునిచ్చారు. బీజేపీ జెండా, మోడీ ఎజెండాతో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు. బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్చార్జిగా నియమితులైన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా, రాష్ట్రంలోని పార్టీ అగ్రనేతలు బండారు దత్తాత్రేయ, మురళీధర్రావు, కిషన్రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, రామచందర్రావు, వెంకట్రెడ్డి, 14 జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.