Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి, ఉద్యోగరంగాలు దెబ్బతిన్నాయి
- ముందు ముందు పరిస్థితులు మారేట్టు లేవు : ఆర్బీఐ 'కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్' సర్వేలో వెల్లడి
నిరుద్యోగం, నిత్యావసర ధరలు...సామాన్యుడ్ని భయపెడుతున్నాయి. ఇంధన ధరల సంగతి ఇక చెప్పక్కర్లేదు. వాహనదారుల మొహంలో సంతోషం కరువైంది. మొత్తంగా చూస్తే..దేశ ఆర్థికరంగం అధ్వాన్నంగా తయారైంది. ఈ మాట అంటున్నది ప్రతిపక్ష పార్టీల నాయకులు కాదు. ఆర్బీఐ తాజా సర్వే 'కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్'లో 13నగరాల్లోని ప్రజాభిప్రాయం ఇది.
న్యూఢిల్లీ : ఒక గొప్ప పరివర్తన దిశగా భారతదేశం పయనిస్తోందని, మన ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని...విదేశాల్లో ప్రచా రం బాగానే చేసుకుంటున్నాంగానీ, ఇందులో ఇసుమంతైనా నిజం లేదని 'ఆర్బీఐ' తాజా సర్వే కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఆర్థిక పరి స్థితి అధ్వాన్నంగా తయారైందని సర్వేలో పాల్గొన్న 44శాతం మంది అభిప్రాయపడగా, ఇంతకు ముందు ఎలా ఉందో...ఇప్పుడూ అలాగే ఉందని 22శాతం మంది తెలిపారు. కేవలం 34శాతం మంది మాత్రమే ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగ, ఉపాధి రంగాలు ఘోరంగా తయారయ్యాయని 45.5శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోలానే ఉందని 19 శాతం మంది చెప్పారు. ఇక నిత్యావసర ధరల పెరుగుదలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. సరకులు ధరలు పెరగటమేగానీ, తగ్గిన దాఖలా లేదని 88శాతం మంది చెప్పారు. ధరలు తగ్గాయని కేవలం 3శాతం మంది మాత్రమే చెప్పారు. తమ రోజువారీ వ్యయం దారుణంగా పెరిగిపోయిందని 78శాతం మంది వాపోయారు.
- దేశవ్యాప్తంగా 13నగరాల్లోని 5,360 కుటుంబాల్లో 'ఆర్బీఐ' తాజా సర్వే సాగింది. ప్రతీ మూడు నెలలకోమారు ఆర్బీఐ ఈ సర్వే నిర్వహిస్తుంది. 'ముందు ముందు పరిస్థితులు మెరుగుపడతాయా?' అని సర్వేలో అడగ్గా, 'ఏం మారదు' అనే అత్యధికమంది చెప్పారు.
- సెప్టెంబరునాటికి సేకరించిన 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ' ప్రకారం, నిరుద్యోగం 6.7శాతంగా నమోదైంది. మరోవైపు కార్మికశక్తిలో మహిళ భాగస్వామ్యం క్రమంగా పడిపోతోంది. ఈ ఏడాది మే-ఆగస్టు మధ్యకాలంలో, ఇది ఆల్టైం కనిష్టస్థాయి 10.65శాతంకు చేరుకుంది.
- కార్మికశక్తిలో మహిళల భాగస్వామ్యం అతితక్కువగా ఉన్న దేశాల్లో మనం కిందనుండి రెండో స్థానంలో ఉన్నామంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టి మన పాలకులు 'అచ్ఛేదిన్' వచ్చాయా? పోయాయా? అన్నది తెలుసుకోవచ్చు.