Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ చివరి కోరిక తీరకుండానే..
న్యూఢిల్లీ: గంగానది ప్రక్షాళన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కాన్పూర్ ఐఐటీ మాజీ ప్రొఫెసర్ జీడీ అగర్వాల్... తన చివరి కోరిక తీరకుండానే తనువు చాలించారు. గంగానది ప్రక్షాళన విషయంలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా ఆయన జూన్ నుంచి 111 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. గంగానదిని కాలుష్య కోరల నుంచి విడిపించి... స్వేచ్ఛగా ప్రవహించేలా చేయాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. దీక్ష కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను ఉత్తరాఖండ్ పోలీసులు గతరాత్రి రిషికేశ్లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే గుండెపోటు రావడంతో ఆయన మృతిచెందినట్టు ఎయిమ్స్ మీడియా కోఆర్డినేటర్ వెల్లడించారు.