Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రివ్యూ పిటిషన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించడాన్ని నిరసిస్తూ బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు కేరళ దేవస్థానం వ్యవహారాల మంత్రి కదకంపల్లి సురేంద్రన్ నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా ఎన్ని నిరసనలు, ఆందోళనలు తలెత్తినా కోర్టు ఆదేశాలను తాము అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. ఈ కేసులో రివ్యూ పిటిషన్ వేసేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఆదేశాలు అమలు చేస్తామని తాము సుప్రీంకు తెలియచేశామని చెప్పారు. ఆ అఫిడవిట్ నుండి వెనక్కి మళ్లేది లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని లేదా ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డును దాఖలు చేయమని కోరాలని శబరిమల ఆలయం ప్రధాన పూజారి, పాండళం రాచకుటుంబం డిమాండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటన వెలువడింది.