Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటరు పెట్రోల్పై 10పైసలు, డీజీల్పై 30పైసలు
- అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా అదే తీరు
న్యూఢిల్లీ: వాహనదారులపై కేంద్రం బాదుడు మారడం లేదు. కేవలం ఒక్క రోజు విరామం తర్వాత పెట్రోల్, డీజీల్ ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ.. ఇంధన ధరలు మాత్రం పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 10పైసలు, డీజీల్పై 30పైసలు మేర పెరిగాయి. పెంచిన ధరల ప్రకారం.. దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 82.36కు చేరింది.
డీజీల్ ధర రూ. 74.62 గా ఉంది. పెట్రోల్ ధరలు అత్యధికంగా దేశవాణిజ్య రాజధాని ముంబయిలో ఉన్నాయి. ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 87.82గా ఉండగా, డీజీల్ ధర రూ. 78.22 గా ఉంది. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 85. 62, డీజీల్ 78.90 గా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో మాత్రం పెట్రోల్, డీజీల్ ధరలు రూ. 87.31, 81.17 గా ఉన్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధరల గతవారం 85 డాలర్లు ఉండగా, ప్రస్తుతం అది 81 డాలర్లకు పడిపోయింది.
పెట్రో ధరలు ఎప్పుడు పెరిగినా.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడాన్ని కేంద్రం సాకుగా చూపేది. అయితే క్రూడాయిల్ ధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ పెట్రో ఉత్పత్తులపై ధరలు పెరగడం మాత్రం గమనార్హం. మరోపక్క, తాజా పెంపుతో దేశంలోని 11 ప్రధాన నగరాల్లో లీటరుపెట్రోల్ ధర రూ. 80 దాటింది. కాగా, గత ఆరురోజుల్లో పెట్రోల్పై దాదాపు 90 పైసలు, డీజీల్పై ఒక రూపాయి పైగా ధరలు పెరిగాయి.