Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాట్సాప్ వీడియో కాలింగ్ లో బగ్.. ఈజీగా హ్యాక్ చేసే అవకాశం
- భారత్లో వాట్సాప్ పేమెంట్స్ సంబంధిత డేటా భద్రమేనా?!
- 5 లక్షల గూగుల్ యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించిన 400 థర్డ్పార్టీ యాప్లు
- విచారణ సంస్థలకు భయపడి 'గూగుల్ ప్లస్' సేవలను షట్డౌన్ చేసిన దిగ్గజం
* కడవేర్గు
దిగ్గజ సంస్థలు చేస్తోన్న చిన్న పొరపాట్లు.. యూజర్ వ్యక్తిగత భద్రత, పర్సనల్ డేటాను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు టెక్ దిగ్గజాల నిర్వాకం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
కాల్ లిఫ్ట్ చేశారో..
భారతదేశంలో పాతిక కోట్లమందికి పైగా యాక్టివ్ యూజర్స్ గల ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సాప్ పై తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక సారాంశం సదరు యాప్ యూజర్లకు కునుకు లేకుండా చేస్తున్నది. ఇక వివరాల్లోకెళితే.. వాట్సాప్ ఇన్ కమింగ్ వీడియో కాల్ ఆన్సర్ చేసినపుడు హ్యాకర్స్ ఆ యూజర్ల అకౌంట్లను హైజాక్ చేసే వెసులుబాటు ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని ప్రముఖ టెక్నాలజీ వెబ్ సైట్లు జడ్ డీ నెట్, ద రిజిస్టర్ పేర్కొన్నాయి. అపరిచిత నెంబర్/హ్యాకర్ నుంచి వచ్చిన వాట్సాప్ వీడియో కాల్ ఆన్సర్ చేసినట్టైతే.. వాట్సాప్ అకౌంట్ తో పాటూ ఫోన్ లోని మిగతా అప్లికేషన్స్ డేటా, పర్సనల్ సమాచారం దుండగుల చేతుల్లోకి వెళ్ళొచ్చని సదరు సైట్లు వెల్లడించాయి. ఇక, భారత్లో పేమెంట్స్ సంబంధిత డేటా నిల్వకు ఓ వ్యవస్థను అభివ ద్ధిపరిచినట్టు తాజాగా వాట్సాప్ పేర్కొనడం తెలిసిందే! ఇప్పుడు, సదరు డేటా నిల్వ భద్రతపై పలువురు చర్చించడం కొసమెరుపు. కాగా, వాట్సాప్ యాజమాన్య కంపెనీ ఫేస్బుక్ కూడా తన యూజర్లపై భారీ దాడి జరిగి.. 5 కోట్ల మంది ఖాతాదారుల డేటాను హ్యాకర్లు దొంగలించినట్టు ఇటీవల పేర్కొనడం గమనార్హం.
దెబ్బకు షట్డౌన్
ఫేస్ బుక్ కి పోటీగా.. 2011 సంవత్సరంలో గూగుల్ సంస్థ ప్రారంభించిన 'గూగుల్ ప్లస్' త్వరలో కనుమరుగుకానున్నది. దీనికి కారణం.. యూజర్ల నుంచి 'గూగుల్ ప్లస్'కు వస్తోన్న స్పందన, సాధారణ యూజర్ల నుంచి ఆశించిన స్థాయిలో సేవల వాడకం లేకపోవడం, అన్నిటికి మించి భద్రతాపరమైన లోపాలేనని తెలుస్తోంది. 'వాల్స్ట్రీట్ జర్నల్' కథనం ప్రకారం.. దాదాపు 400 థర్డ్పార్టీ యాప్లు.. గూగుల్ ప్లస్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని 2015 నుంచి దొంగిలిస్తూ వచ్చాయని.. జావా, జావాస్క్రిప్ట్ తో రూపొందించిన గూగుల్ ప్లస్లో ఉన్న ఓ బగ్ కారణంగా దాదాపు 5 లక్షల యూజర్ల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురైందని.. విచారణ సంస్థలకు భయపడి గూగుల్ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్టు సదరు వార్తా సంస్థ పేర్కొంది. కాగా, వ్యక్తుల కదలికలపై నిఘా, యూజర్ల వ్యక్తిగత గోప్యత, కస్టమర్లు ఆఫ్ లైన్ లో చేసే కొనుగోళ్లకు సంబంధించిన లావాదే వీలను బహిర్గతం చేయడం వంటి అంశాల్లో గూగుల్ ఇప్పటికే పలు విమర్శలను ఎదుర్కోవడం విదితమే!