Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోప్ర : శబరిమలను మరో అయోధ్యగా మార్చాలని బీజేపీ యత్నిస్తోందా..? కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని అస్థిరపర్చ టమే లక్ష్యంగా సంఫ్ు పరివార్ పావులు కదుపుతున్నదా..? అయ్యప్ప ఆలయ ప్రవేశానికి మహిళలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించడం బీజేపీ- సంఫ్ుపరివార్ శక్తులకు ఇష్టం లేదా..? తమ ఇష్టాయిష్టాల కు అనుగుణంగా రాజ్యాంగాన్ని సైతం మార్చాలన్న సంఫ్ు పరివార్.. తన వ్యూహాన్ని అమలు చేయడానికి దీనిని కూడా ఓ అవకాశంగా భావిస్తున్నదా..? సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం ఓవైపున కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రయత్నిస్తుం డగా.. అందుకు అడ్డంకులు కల్పించేందుకు సంఫ్ుపరి వార్ శక్తులు పూనుకోవడం దేనికి సూచిక..? మహిళలకు పురుషు లతోపాటు సమాన హక్కులు, గౌరవం దక్కాల్సిందేనని స్పష్టం చేసిన రాజ్యాంగస్ఫూర్తికి భంగం కలిగించేలా బీజేపీ ప్రేరేపిత సంఫ్ుశక్తులు పూనుకోవడం ప్రగతిశీల శక్తుల్ని విస్మయపరుస్తోంది. మహిళలను గౌరవించే సంస్కృతి తమదంటూ గొప్పగా చెప్పుకునే హిందూత్వవాదులు తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాల్సిన తరుణం ఇదే..!!
దక్షిణాది అయోధ్యగా భక్తులు కొలిచే శబరిమలను వేదికగా చేసుకుని బీజేపీ,సంఫ్ుపరివార్ వేస్తున్న ఎన్నికల ఎత్తులు వివాదస్పదంగా మారాయి. దేశవ్యాప్తంగా తమ కార్యకర్తలను సమీకరించి కేరళలో అలజడులు సృష్టించేం దుకు ప్రయత్నిస్తోందన్న వాదనలకు బలం చేకూరిస్తు న్నాయి. మతాన్ని రాజకీయ విజయాలకు సోపానంగా వాడు కునే సిద్ధాంతం కలిగిన బీజేపీ ఎలాంటి సంకోచం లేకుండా కేరళలో మత రాజకీయాలకు పాల్పడుతోంది. కేరళను ఎలాగైనా తమ గుప్పెట్లో తీసుకోవాలని దశాబ్దాలుగా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతూనే ఉన్నాయనటానికి ఎన్నో ఆధారాలు.. మరెన్నో ఉదాహరణలు.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేరళలో కేవలం ఒక్క సీటు మాత్రమే సాధిం చగలిగింది. దేశంలోని మిగిలిన అన్ని రాష్ట్రాలలో ఏదోఒక విధంగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధిపత్యం చెలాయి స్తున్న బీజేపీకి కేరళ రాష్ట్రం ఒక కొరకరాని కొయ్యగా మారింది. దేశం మొత్తం మీద కేరళలోనే అధికంగా సంఫ్ు శాఖలను ఏర్పాటు చేసినా..ఏదో ఒక కార్యక్ర మం పేరిట బీజేపీ అధ్యక్షుడు అమిత్షా హడావుడి చేసినా అక్కడ వారి పప్పులేం ఉడకటం లేదు. చివరికీ హత్యారాజకీయా లు చేసి నా కూడా కేరళలో అక్క డ కాలూనుకోవడం బీజేపీకి సా ధ్యం కావడం లేదని హస్తిన పెద్దల్లో చర్చ.
దేశంలోని మిగిలిన రాష్ట్రాల సామాజిక పొందిక వేరు.. కేరళ పరిస్థితి వేరు. కేరళలో 27 శాతం ముస్లింలు ఉన్నారు. క్రిస్టియన్లు 19శాతం. మొత్తం హిందువులు 54.73శాతం కాగా,అందులో వెనుకబడిన తరగతులకు చెందిన ఎజు వాలు(గౌడ్స్) 21శాతం. ఎస్స్సీలు 9.8శాతం. బ్రాహ్మణులు, నంబూద్రీ బ్రాహ్మలు కలిపి 2శాతం కాగా, శూద్ర అగ్రకులాలై న నాయర్లు 12.10 శాతం, దేేవర్లు 3శాతం ఉన్నారు.
నిజానికి, గతంలో దేశంలోని ఇతర రాష్ట్రాలలోకన్నా కేరళలో కుల వివక్ష అధికం. దళితులు బ్రాహ్మణుల కంటికి కూడా కనిపించకూడదన్న నియమం కేరళలో మాత్రమే ఉండేది. అణగారిన కులాలకు చెందిన మహిళలు తమ వక్షోజాలపై ఎలాంటి వస్త్రాన్నీ ధరించకూడదన్న నియమం ఉండేది. ఈ దుర్మార్గమైన సామాజిక అణచివేతకు వ్యతిరేకం గా ఎజువా కులానికి చెందిన నారాయణగురు ( 1854 -1920) గొప్ప సాంఘిక విప్లవం తీసుకొచ్చారు. దీంతో, కేరళలోని అణగారిన కులాలు చైతన్య వంతమయ్యాయి. కావునే దేశంలోనే మొదటి సారిగా కమ్యూ నిస్టులు అక్కడ ప్రభుత్వాన్ని 1957 లోనే ఏర్పాటు చేయడం సాధ్యమ య్యింది. పీడిత ప్రజల అనుకూల, మతాతీత భావజాలంతో కేరళలో సాగు తున్న కమ్యూనిస్టు పాలన ఆ రాష్ట్రాన్ని అన్ని రం గాలలో అగ్రస్థానంలో నిలిపింది. మత సామరస్యం వెల్లివిరు స్తోంది. ఇప్పటికీ శబరిమల సందర్శించే ప్రతి భక్తుడూ అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలోని ఇరుమలైలో ఉన్న వా వార్ మసీదును దర్శించుకున్న తరువాతే అయ్యప్ప దర్శనా నికి వెళ్తారు. అక్కడి ముస్లింలు అయ్యప్ప భక్తులకు తమ ఇండ్లలో ఆశ్రయమిస్తారు.
తమకు బద్ధ వ్యతిరేకమైన సామాజిక చైతన్యం, కమ్యూ నిస్టు భావజాలం, మతసామర్యంతో అలరారుతున్న కేరళను కబళించడం బీజేపీకి కలగానే మిగిలిపోతోంది. ఎలాగైనా కేరళలో కాలుమోపేందుకు విశ్వప్రయత్నం చేస్తోన్న సంఫ్ు పరివార్ మొదట అధిక జనాభాకలిగిన అగ్రకులమైన నాయర్లపై దృష్టిసారించింది. నాయర్ల సేవాసంఘం (ఎన్ ఎస్ఎస్)ను మచ్చిక చేసుకుని తమ శాఖలను ఇబ్బడిము బ్బడిగా ఏర్పాటు చేసింది. ఆ తరువాత దళితులపై కేంద్రీ కరించింది. దళితులను ఆకర్షించడంలో భాగంగానే 2014 లో జరిగిన గొప్ప దళిత సంస్కర్త అయ్యంకాళి 152వ జయంతి ఉత్సవాలకు ప్రధాని మోడీ స్వయంగా హాజరయ్యా రు. అయినా, జనాభాలో 15శాతానికి మాత్రమే పర మతమై న నాయర్లు, బ్రాహ్మణులు, నంబూద్రీ బ్రాహ్మణులలో తప్ప మిగిలిన ప్రజలలో పట్టు సాధించలేకపోతోంది. హిందువు లలో అధికశాతాన్ని తమవైపు తిప్పుకోకుండా బీజేపీ అక్కడ అధికారంలోకి రావడం అసాధ్యం. ఇందుకోసం బీజేపీ ఇప్పు డు శబరిమలను ఎంచుకున్నదని విశ్లేషకుల అంచనా. శబరి మలను హిందువుల సమీకరణకు మాత్రమే కాకుండా, హిం దువులకు - ముస్లింలకు మధ్య చిచ్చుపెట్టేందుకు కూడా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్ ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ 'సుప్రీం కోర్టు తీర్పును అంగీకరించాల్సిన అవసరం లేదు' అని వ్యాఖ్యానిం చటం గమనార్హం. తద్వారా 'ట్రిపుల్ తలాక్ తీర్పును మేమూ అంగీ కించమని' ముస్లింల చేత అనిపించాలన్నది ఆయన ఎత్తు గడ ముస్లింలు ఆమాటంటే హిందూ,ముస్లింల మధ్య విద్వే షం రెచ్చగొట్టి హిందువులను తమవైపు సమీకరించు కోవచ్చు.
అయితే, సాంప్రదాయ హిందుత్వ శక్తుల అణచివేతను, దౌర్జన్యాలను తరతరాలుగా అనుభవించి, వాటిపై దశాబ్దా లుగా యుద్ధం చేసి కమ్యూనిస్టుల అండతో స్వేచ్ఛాజీవితం గడుపుతున్న కేరళ అణగారిన జనం తిరిగి ఇప్పుడు బీజేపీ రూపంలో సాగుతున్న వారి పన్నాగాలను అంగీకరిస్తారా?. బీజేపీ పాలిత మహారాష్ట్రలో శనిసింగణాపూర్ ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతించాలని సుప్రీం ఆదేశిస్తే... అక్కడ సరేనన్నది బీజేపీ,సంఫ్ుపరివార్. అదే సుప్రీం శబరిమలలో మహిళలను ప్రవేశం కల్పించమంటే.. బీజేపీ, సంఫ్ు రివార్ మోకాలడ్డుతున్నాయి. భక్తుల ముసుగులో దూరిన హిందూత్వశక్తులు దాడులకు పాల్పడేలా హస్తిన పెద్దలు వెనుకుండి నడిపిస్తున్నారని స్పష్టమవుతున్నది. పైగా వామపక్షపార్టీ అధికారంలో ఉన్న కేరళను శబరిమ లలో మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటే...దక్షిణాదిలో మత పరమై పట్టుసాధించగలమన్న భావనలో బీజేపీ,సంఫ్ు పరి వార్లు ఉన్నట్టు అవగతమవుతున్నది. హిందూత్వశక్తుల వెనుక ఉన్న వాస్తవాలను అయ్యప్పభక్తులు గమనంలోకి తీసుకోవాలని సీపీఐ(ఎం) సూచిస్తున్నది. కేరళ భవిష్యత్ పరిణామాలెలా ఉంటాయోనని దేశంయావత్తు ఆ వైపు చూస్తున్నది.