Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై లైంగికదాడి ఆరోపణలతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఆ రాష్ట్ర క్రైం బ్రాంచి అధికారులు తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2013లో సంచలనం సృష్టించిన సోలార్ ఎనర్జీ స్కామ్లో నిందితురాలుగా ఉన్న సరితా నాయర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. తిరువనంతపురంలోని తన అధికారిక కార్యాలయ మైన క్లిప్ హౌస్లో లైంగిక దాడికి పాల్పడివుండవచ్చునన్న ప్రాథమిక సమాచారంతో ఊమెన్ చాందీపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు తిరువనంతపురంలోని చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని అధికారులు చెప్పారు.