Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల్లాగే పురుషులకూ 18ఏండ్లే ఉండాలని వ్యాజ్యం
న్యూఢిల్లీ: పురుషులకు చట్టబద్ధ వివాహ వయస్సును 21ఏండ్ల నుంచి 18కి తగ్గించాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మహిళలకు ఉన్నట్టుగానే పురుషులకూ పెండ్లి వయసు 18 ఏండ్లే ఉండాలంటూ దాఖలైన ఈ పిటిషన్లో ప్రజా ప్రయోజనం ఏమీ లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది అశోక్ పాండేకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోరు, న్యాయమూర్తి ఎస్కె కౌల్లతో కూడిన ధర్మాసనం 25వేల జరిమానానూ విధించింది. 18 ఏండ్ల వయసుతో బాలుడు మేజర్ అవుతాడని, ఓటు వేయడానికి కూడా అర్హుడవుతాడని పిటిషన్లో న్యాయవాది అశోక్ పాండే పేర్కొన్నారు. మహిళలు, పురుషులకు వివాహ వయస్సు వేర్వేరుగా ఉండటం వల్ల పురుషులు నష్టపోతున్నారని వాదించారు. అయితే 'ఈ సమస్యలతోనే పురుషుడు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మీరు కట్టే ఆ 25వేల జరిమానాను వారికి అందజేస్తామ'ని బెంచ్ అన్నది. పురుషుల వివాహ వయసును పేర్కొనే బాల్య వివాహల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాలు రాజ్యాంగం కల్పించే ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నాయని పిటిషన్లో వివరించారు.