Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కింది కోర్టులలో 6 వేల ఖాళీలు
- సుప్రీంకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: కింది కోర్టులలో ఖాళీగా ఉన్న జడ్జీ పోస్టులను భర్తీ చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ, సుప్రీంకోర్టు కలిసి దేశవ్యాప్తంగా 6వేల జడ్జీపోస్టులను ఒకేసారి భర్తీ చేయనున్నారని సమాచారం. అధికారుల కథనం మేరకు... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో జిల్లా కోర్టు జడ్జీలు, అనుబంధ కోర్టులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని జడ్జీ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థుల నియామకాలు చేపట్టనున్నారు. ఈ భర్తీలను సుప్రీంకోర్టు నిర్దేశకాల మేరకు భర్తీ చేయనున్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఖాళీగా ఉన్న పోస్టులను ప్రాథమికంగా తీసుకుని తక్షణమే భర్తీ చేయాలని అని అన్నారు. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు, అదనపు కోర్టులలో ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులను తెప్పించాలని కోరారు. కింది కోర్టులలో ప్రస్తుతం 2.78 కోట్ల పెండింగ్ కేసులున్నాయని ఆయన అన్నారు. పరీక్ష నిర్వహణ ప్రక్రియను న్యాయశాఖ అధికారులు ఆలస్యం చేయడం వల్లే కింది కోర్టులలో ఖాళీలు భారీగా పెరిగిపోతున్నాయన్నారు. 2017 ఏప్రిల్లో న్యాయ మంత్రిత్వశాఖ జడ్జీల నియామక ప్రక్రియను ఏర్పాటుచేయాలని కేంద్ర ఎంపిక యంత్రాంగాన్ని కోరింది. దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను 2017 మే 9న రిట్ పిటిషన్ రూపంలో రాష్ట్రాల హైకోర్టులకు దానికి సంబంధించిన అధికారాలు, సూచనలను పంపింది.