Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత మహిళపై దాడి
పాట్నా: సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా సమాజంలో మూఢ నమ్మకాలకు మాత్రం కాలం చెల్లడం లేదు. మంత్రగత్తె అనే అనుమానంతో ఓ దళిత మహిళపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన బీహార్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి మనుమరాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోV్ాతాస్ జిల్లా రెడియా గ్రామానికి చెందిన డెబ్భై ఏండ్ల రాజ్కాళీ దేవీపై ఆదివారం రాత్రి ముగ్గురు గ్రామస్తులు దాడి చేశారు. మంత్రాలు చేస్తుందని ఆరోపిస్తూ ఆమె నాలుకను కత్తిరించారు. ఆదివారం సాయంత్రం బలవంతంగా ఆమె ఇంటిలోకి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో బంధువులు ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. కాగా, నిందితులు పరారీలో ఉన్నారు.