Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది కేవలం దళితుల సమస్యే కాదు సామాజిక సమస్య :
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు
- వి శ్రీనివాసరావు
అమరావతి:సంస్కరణోద్యమాలతోనే కుల దురహంకార హత్యలను నిర్మూలించవచ్చని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వి శ్రీనివాసరావు సూచించారు. ' కుల దురహంకార హత్యలు, పరిష్కారాలు' అనే అంశంపై ఎంబి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ ఎంబివికెలో సోమవారం సదస్సును నిర్వహించారు. దీనికి ముఖ్య అతిధిగా హాజరైన వి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కూడా కుల వివక్ష కొనసాగడం దారుణమన్నారు. సమాజంలో కుల అంతరాలు అనేక రూపాల్లో కొనసాగుతున్నాయన్నారు. వివాహ విషయంలో కుల వివక్ష నేటికీ కొనసాగుతోందన్నారు. సమాజానికి కనిపించని కుల బహిష్కరణలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రేమ విషయంలో కుల పట్టింపులకు ప్రాధాన్యతను ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 11 శాతం మాత్రమే కులాంతర వివాహాలు జరుగుతున్నాయని, దళితుల్లో ఈ సంఖ్య కేవలం 5 శాతం మాత్రమే ఉందన్నారు. అభివృద్ధి చెందిన హైదరాబాద్, మిర్యాలగూడ ప్రాంతాల్లో కుల దురహంకార హత్యలు చోటు చేసుకోవడం సమాజ తిరోగమనాన్ని సూచిస్తోంద న్నారు. ప్రణరు హత్యను కొంత మంది కులోన్మాదులు బలపర్చడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. గత ఐదేండ్లుగా కుల దురహంకార హత్యలు పెరిగాయని, తమిళనాడులోనే 400 కుల దురహంకార హత్యలు చోటు చేసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా హత్యలు తెలుగు రాష్ట్రాలకు సైతం వ్యాపించడం ప్రమాదకరమన్నారు. ప్రశ్నించే తత్వం పెరిగిన చోట ఈ తరహా హత్యలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇది కేవలం దళితుల సమస్య మాత్రమే కాదని సామాజిక సమస్యగా చూడాలన్నారు. కులాలకు వ్యతిరేకంగా కార్మికవర్గం ఏకం కావాలన్నారు. కుల దురహంకార హత్యల నిర్మూనలకు సైద్ధాంతిక పోరాటం అవసరమని, ఇందులో దళిత సంఘాలతో పాటు కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాలు కలిసి పోరాడాలని అభిప్రాయపడ్డారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వం రక్షణ కల్పించడంతో పాటు సాయం అందించాలన్నారు. ఉద్యోగం, ఉపాధి అవకాశా లు, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించాల న్నారు. కులాంతర వివాహాలు తప్పు కాదనే భావన ప్రజల్లో కల్పించాలన్నారు. సామాజిక వికాసం కోసం కుల వివక్షకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలన్నారు. ఎంబీవీకే కార్యక్రమాల సమన్వయ కమిటీ కన్వీనర్ కె ఎస్సి బోస్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఎంబీవీకే ఇన్చార్జి బిఆర్ తులసీరావు తదితరులు పాల్గొన్నారు.