Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది దుర్మరణం.. 18 మందికి గాయాలు
- ఉభయగోదావరి, విశాఖల్లో దుర్ఘటనలు
- మోతుగూడెం వద్ద తప్పిన ఘోర ప్రమాదం
విజయవాడ: రాష్ట్రంలోని ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో సోమవారం రహదారులు రక్తాన్ని చిమ్మాయి. వేర్వేరుచోట్ల జరిగిన పెద్ద ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 18 మంది గాయపడ్డారు. మృతుల్లో తొమ్మిదిమంది మహిళలు, మరో చిన్నారి ఉన్నారు.
విజయవాడ-విశాఖ మధ్య జాతీయ రహదారిపై తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిదిమంది మృతి చెందగా, ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం జి.గోడూరు, జి.వెంకటాపురం గ్రామాలకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 15 మంది టాటా మ్యాజిక్ వాహనంపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ డ్రైవర్ కాలనీలో సోమవారం ఉదయం బంధువుల ఇంటికి గృహప్రవేశానికి వచ్చారు. మధ్యాహ్న భోజనం అనంతరం టాటామ్యాజిక్పై విశాఖకు పయణమయ్యారు. మూడు గంటల సమయంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు 216 జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ఎదురుగా వేగంగా వస్తున్న టిప్పర్ లారీ ఢకొీట్టింది. దీంతో, వాహనంలోని మహిళలు సబ్బవరపు పైడితల్లి (45), మహాలక్ష్మి (45), అచ్చియమ్మ (50), పాప (30), పైలా లక్ష్మి (45), గోవిరెడ్డి రాము (35) అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిదిమంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆటోడ్రైవర్ ఆళ్ల సంతోష్ (30), సబ్బవరపు వరహాలు (45) చనిపోయారు. తీవ్రంగా గాయపడిన సబ్బవరపు ఏసుపాప, సత్యవతి, నూకాలతల్లి, చింతా సత్యవతి, భీమిడి నాగరాజు, పైలా రోహిణి, చింతల రామచంద్రలను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలాన్ని కాకినాడ డిఎస్పి రవివర్మ, పిఠాపురం సిఐ అప్పారావు, గొల్లప్రోలు ఎస్ఐ శివకృష్ణ పరిశీలించారు. టిప్పర్ లారీడ్రైవర్ పరారీలో ఉన్నాడు. కాకినాడ జిజిహెచ్లో క్షతగాత్రులను ఎస్పి విశాల్గున్నీ పరామర్శిం చారు. తూర్పుగోదావరి జిల్లాలోనే మరో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. చింతూరు మండలం మోతుగూడెం పెద్దవాగు మూలమలుపు వద్ద హైదరాబాద్ నుంచి విశాఖపట్నం
వెళ్తున్న ఆర్టిసి బస్సు ముందు చక్రాల బ్రేక్ డ్రమ్ములు పట్టేయడంతో పక్కకి ఒరిగిపోయింది. డ్రైవర్ సిహెచ్ రాజు బస్సు బోల్తా పడకుండా చాకచక్యంగా నిలిపివేశారు. 55 మంది ప్రయాణికులనూ వేరొక బస్సులో గమ్యస్థానాలకు తరలించారు. జలవిద్యుత్ కేంద్రం అధికారుల చొరవతో క్రేన్ ద్వారా బస్సును పైకి లాగారు.
ముగ్గురు కూలీల దుర్మరణం : మరో ఆరుగురికి తీవ్రగాయాలు
రివర్స్లో వస్తున్న రెడీ మిక్స్ మిల్లర్ను లారీ ఢకొీట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు దుర్మరణం మృతిచెందారు. . మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఉంగుటూరుకు చెందిన ఎనిమిదిమంది కూలీలు అక్కడి ఆక్వా ఫ్యాక్టరీ నుంచి విజయనగరం జిల్లా బొబ్బిలిలో చేపలు లోడింగ్ చేసేందుకు లారీపై ఆదివారం రాత్రి బయలుదేరారు. తేతలి సమీపంలోని పెట్రోల్ బంకు వద్దకు వెళ్లేసరికి విశాఖపట్నం నుంచి వస్తున్న రెడీ మిక్స్ మిల్లర్ రివర్స్ చేయడంతో కార్మికుల లారీ ఢకొీట్టింది. దీంతో, కార్మికులు నక్కెళ్ల కాశీవిశ్వనాధం (50), మైనం లక్ష్మణరావు (33), పెరుమాళ్ల హుస్సేన్ (35) మృతి చెందారు. డ్రైవర్తోపాటు మరో ఐదుగురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఆటో బోల్తా పడి ముగ్గురు దుర్మరణం : మరో ముగ్గురికి తీవ్రగాయాలు
విశాఖ మన్యంలోని పాడేరు ఘాట్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన చిన్నారిసహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం పెందుర్తిలో ఉద్యోగం చేస్తున్న పాడేరు మండలం నక్కలపుట్టుకు చెందిన సొనాయి అంబేద్కర్ దసరాకు స్వగ్రామానికి తన కుటుంబంతో వచ్చి తిరిగి ఆటోలో ప్రయాణమయ్యారు. పాడేరు ఘాట్ రోడ్డులోని వంట్లమామిడి దాటిన తరువాత ఆటో బ్రేకులు ఫెయిలై, మలుపు వద్ద ఫల్టీలు కొట్టి రక్షణ గోడను ఢకొీంది. ఆటోలో ప్రయాణిస్తున్న అంబేద్కర్ భార్య మరియమ్మ (24), చెల్లెలు సాయిరత్నం (23) అక్కడికక్కడే మృతి చెందారు. అంబేద్కర్తోపాటు ఆయన ఏడాది కొడుకు, ఆరు నెలల కూతురు, ఆటోడ్రైవర్ గణపతి తీవ్రంగా గాయపడ్డారు.