Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-న్యూఢిల్లీ
సామాజిక న్యాయం దిశగా కాంగ్రెస్ అడుగులు వేసింది. అన్ని సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయించాలన్న రాహుల్ ఫార్ములాపై స్క్రీనింగ్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల దేశ వ్యాప్తంగా కుల ప్రాతిపదిక ఉద్యమాలు పెద్ద ఎత్తున్న వస్తున్న నేపథ్యంలో ఈ పార్టీ అధిష్టానం దిగొచ్చింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు ఈ విధానాన్ని అమలు చేయాలని వివిధ కమిటీలను ఆదేశించింది. అందులో భాగంగానే సోమవారం ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విభాగాలకు చెందిన నేతలతో వేర్వేరుగా, ఉమ్మడిగా చర్చలు జరిపింది. పలు సామాజికవర్గాలపై ఆరా తీసింది. జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటయించాలని ఓబీసీ విభాగం నేతలు కోరారు. ఎస్సీ సామాజికవర్గం తరుపున టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ భట్టి విక్రమార్క, మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి అద్దంకి దయాకర్, ఎస్టీ విభాగం నుంచి సీతక్క, బెల్లయ్యనాయక్, బలరాంనాయక్, జగన్లాల్, రవీంద్రనాయక్, రేగ కాంతారావు, ఓబీసీ విభాగం నుంచి మధుయాస్కీ, కత్తి వెంకటస్వామి, నాగయ్య, మహేష్కుమార్గౌడ్ ఉన్నారు. రాష్ట్రంలోని 119 స్థానాలలో బీసీలకు 45 సీట్లు ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. ఎస్సీలకు 19 స్థానాలల్లోనూ మాల, మాదిగలకు సమన్యాయం చేసేలా నిర్ణయంతీ సుకునుంది. లంబాడీలు, ఆదివాసీలకు అవకాశం కల్పించనుంది.