Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మోహుల్ చోక్సీ కేసు విషయంలో వస్తున ్న ఆరోపణల దృష్ట్యా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజీనామా చేయాలని యూత్ కాంగ్రెస్ మంగళవారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి క్రిష్ణ మీనన్ మార్గ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ...జైట్లీ కూతురు ,అల్లుడు ఇద్దరూ లాయర్లనీ, వారికి ఫీజు కింద చోక్సీ 24లక్షల రూపాయలిచ్చారని ఆరోపించారు. గతంలో జైట్లీ అల్లుడు ఒకసందర్భంలో మాట్లాడుతూ తాను చోక్సీ దగ్గర డబ్బుతీసుకున్న మాట వాస్తవమేననీ , కానీ కుంభకోణంలో చోక్సీ కంపెనీ పాత్ర ఉందని తెలియగానే ఆ డబ్బును తిరిగిచ్చేసానని అన్నారని గుర్తు చేశారు.