Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాసంస్థల్లో భగవద్గీత, రామాయణం
- పుస్తకాల ఏర్పాటుపై ఆదేశాలు ఉపసంహరణ
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉన్న అన్ని విద్యాసంస్థలు భగవద్గీత, రామాయణాలకు సంబంధించిన ఉర్దూ వెర్షన్ పుస్తకాలను అందుబాటు లోకి తేవాలన్న ప్రతిపాదనపై ఆ రాష్ట్ర ప్రభుతం వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో తమ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్టు వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ బివిఆర్ సుబ్రమణ్యం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, ఇతర లైబ్రరీల్లో భగవద్గీత, రామయణాలకు సంబంధించిన పుస్తకాలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం సోమవారం సర్కూలర్ జారీ చేసింది. దీనిపై మాజీ సీఎం, ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. ఒకమతానికి సంబంధించిన భగవద్గీత, రామాయణాలను మాత్రమే ఎం దుకు ప్రవేశపెట్టాలని, ఇతర మతాలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్ని స్తూ ఆయన ట్వీట్చేశారు. కాగా జమ్మూకాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సలహాదారు బిబి వ్యాస్ నేతృత్వంలో ఈ నెల 4న జరిగిన సమావేశంలో ఈ పుస్తకాలను ప్రవేశపెట్టానే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తు తం జమ్మూకాశ్మీర్లో గవర్నర్ పాలన సాగుతున్న విషయం తెలిసిందే.