Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ్పూర్: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో తగిన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం ఆర్ఎస్ఎస్ అజ్ఞానాన్ని నిరూపించిందని బీజేపీ మాజీ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేయడంపై ఆర్ఎస్ఎస్కు గల అర్హతను ఆయన ప్రశ్నించారు. 'అయోధ్య అంశం సుప్రీంకోర్టులో ఉండగా పార్లమెంటు దీనిపై చట్టం ఎలా చేస్తుంది. దీన్ని బట్టి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పునూ నిర్వీర్యం చేసే విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి' అని అన్నారు. 'ఏకాభిప్రా యం' లేదా కోర్టు తీర్పు ద్వారా మాత్రమే ఈ అంశం పరిష్కారమవు తుందనేది బీజేపీకి తెలుసునన్నారు. అయోధ్య అంశం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణలో ఉన్నది కావున ఆర్ఎస్ఎస్ కోర్టు తీర్పు కోసం వేచి ఉండాలని చెప్పారు. రామమందిర నిర్మాణానికి పార్లమెంటు లో సరైన చట్టాన్ని తీసుకొచ్చి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రం మార్గం సుగమం చేయాలని మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్య లు చేసిన విషయం తెలిసిందే. కాగా, తన గుర్తింపును మెరుగుపర చుకోవడానికి సంఫ్ు సమావేశాలకు ఎంత మంది ప్రముఖ నాయకుల ను ఆహ్వానించినా ఆర్ఎస్ఎస్ ఎన్నటికీ మారదని ఆయన అన్నారు.