Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐజ్వాల్: ఈశాన్య రాష్ట్రం మిజోరాం అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ నేతృత్వంలో 2016లో ప్రాంతీయపార్టీలతో కలిసి ఏర్పాటు చేసిన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి(ఎన్ఈడీఏ)లో భాగస్వామి, ప్రతిపక్ష మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్).. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్రంలోని ఉన్న మొత్తం 40 స్థానాలకు ఆ పార్టీ పోటీ చేయ నుంది. ఇందులో 17 మంది కొత్తవారికి అవకాశాన్ని కల్పించింది. ఎంఎన్ ఎఫ్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జోరంతంగా ఐజ్వాల్ తూరు-1 నియోజ కవర్గం నుంచి బరిలో నిలవనున్నారు. ఎంఎన్ఎఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తాన్లుయా మయన్మార్ సరిహద్దు జిల్లా చంపారులోని తురుచంగ్ నియోజవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఎంఎన్ఎఫ్ అభ్యర్థుల్లో నలుగురు డాక్టరేట్లు, ఇద్దరు మెడికల్ డిగ్రీలు పొందినవారు ఉన్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లోల మాత్రం ఎన్ఈ డీఏ కూటమిని కాదని ఎంఎన్ఎఫ్ ఒంటరి పోరుకు దిగుతుండడం బీజేపీకి మింగుడుపడటం లేదు.