Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
కోల్కతా : రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగిన దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన బెంగాల్లోని హౌరాలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. హౌరాలోని సత్రాగాచి రైల్వేస్టేషన్లో ఉన్న ఫూట్ఓవర్ బ్రిడ్జిపై మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భీతావహంగా మారింది. గాయ పడిన వారిని రైల్వే సిబ్బంది, తోటి ప్రయాణికులు హుటాహు టిన ఆస్పత్రికి తరలించారు. నాగేర్కోయిల్-శాలిమార్ ఎక్స్ప్రెస్తో పాటు మరో రెండు లోకల్ ట్రైన్లు ఒకే సమయంలో స్టేషన్కు చేరుకున్నాయని, వాటిని చేరుకునే క్రమంలో ప్రయాణికులు బ్రిడ్జిపై పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.