Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఫిర్యాదులను డీల్ చేయడానికి తగిన ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇందుకుగానూ వచ్చే నెల 15 వరకు తుదిగడువు విధించింది. ఆన్లైన్లో పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలను నియంత్రించడానికి అనుగుణంగా నిబంధనలు సిద్ధం చేయాలని జస్టిస్ మదన్ బి లోకుర్, యుయు లలిత్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు గూగుల్, యాహూతోపాటు వాట్సాప్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు ఈ నిబంధనలకు సంబంధించిన కాపీలను అందించాలని హోం వ్యవహారాల శాఖకు సూచించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ, లైంగికదాడులకు సంబంధించిన వీడియోల ప్రసారాల్ని నిషేధించాలని కోరుతూ ప్రజ్వల అనే స్వచ్చంద సంస్థ(ఎన్జీవో) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు వెల్లడించింది. కాగా ఇప్పటి వరకు నమోదైన ఫిర్యాదుల సంఖ్యను స్పష్టంగా వెల్లడించే విధంగా యూనియన్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ సమర్పించాలని, దాని ప్రకారం తగిన చర్యలు తీసుకునే అవకాశముంటుందని కోర్టు సూచించింది.