Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రం ప్రకటించిన జాతీయ పౌర ముసాయిదా (ఎన్ఆర్సీ)లో పేరు లేదనే కారణంగా అసోంకు చెందిన ఓ రిటైర్డ్ స్కూల్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగల్డోరు జిల్లాలో సోమవారం జరిగిం ది. పోలీసుల వివరాల ప్రకారం.. 34 ఏండ్లు ఉపాధ్యాయుడిగా పనిచేసిన కుమార్ దాస్ (74).. సోమవారం ఉదయపు నడకకు వెళ్లొ చ్చి ఇంటిలోనే ఉరివేసుకుని చనిపోయాడు. ఎన్ఆర్సీలో తన కుటుంబ సభ్యులు, బంధు వుల పేర్లు వచ్చాయని.. తనను మాత్రం విదేశీయుడిగా గుర్తించారనే మానసిక వేదనతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆయన లేఖలో రాశారు. దాస్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పలు విద్యార్థి సంఘాలు జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి.