Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తరఫు మాజీ న్యాయవాది రమేశ్చంద్రపాండే మంగళవారం ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. లక్నోలోని అలహాబాద్ హైకోర్టు నూతన భవనం మూడో అంతస్థుపై నుంచి కిందికి దూకారు. తీవ్ర గాయాలపాలైన అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. యూపీ ప్రభుత్వ చీఫ్ స్టాండింగ్ లాయర్గా పని చేసిన పాండే ఈ యేడాది జులై 19నే రాజీనామా చేశారు. అనంతరం అసోసియేషన్ జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. పాండే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.