Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్గత పోరుకు అదే అసలు కారణం
న్యూఢిల్లీ : ఇటీవల దేశంలోని వివిధ ప్రాంతాలలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో వున్న పార్టీ నాయకత్వం తన రాజకీయ ప్రత్యర్థులను వేటాడేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిఘా, దర్యాప్తు సంస్థలను వినియోగిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రత్యర్థి పక్షాల నేతలను బెదిరించేందుకు తమ సంస్థను పావులా ఉపయోగించుకు నేందుకు అధికార పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలను సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రముఖ ప్రతిపక్ష నేతపై ఒక కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత ఆయనపై దాడులు చేయాలని ప్రభుత్వం సీబీఐని ఆదేశిం చింది.
అయితే వర్మ దీనిని వ్యతిరేకిస్తూ ఆధారాలు సేకరించేందుకు దాడులుచేసే స్థాయి దాటి పోయిందని, కేసులో తాజా ఆధారాలేవీ లభించలేదని ప్రభుత్వానికి వివరించారు. అదే విధంగా ముగ్గురు ప్రతిపక్ష సీఏంలపై దాడులు చేయాలని లేదా వారిని అరెస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కూడా వర్మ నిరాకరిం చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అరెస్ట్ చేసిన ఒక కేసులో ముఖ్యమంత్రిపై దాడి చేశారు. మరో అక్రమాస్తుల కేసులో మరో ముఖ్యమంత్రి బంధువుపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ప్రతిపక్షానికి చెందిన మరో ప్రముఖ మహిళా నేత కీలక కూటమిలో చేరాలని నిర్ణయించుకోవటానికి రెండు రోజుల ముందు ఆమె సోదరుడిపై సీబీఐ దాడి చేసి అతడిని రెండు రోజులపాటు తమ కస్టడీలో వుంచుకుంది. మరో సందర్భంలో కుమారుడి అవినీతి కేసులో 70 ఏండ్ల మహిళా ప్రతిపక్ష నేత అరెస్ట్కు ఆస్తానా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత నేరం ఆర్థిక నేరం అయినందున, ఆర్థికపరమైన విచారణ కొనసాగిస్తే సరిపోతుందని, భౌతిక కస్టడీ అవసరం లేదని వర్మ వాదించారు.
అవినీతితోనే వివాదం
ఇందుకు సంబంధించి తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) చెలరేగుతున్న వివాదాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తుతం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా వ్యవహరిస్తున్న రాకేశ్ ఆస్తానా కోట్ల రూపాయల లంచం స్వీకరించి అవినీతికి పాల్పడిన ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటున్న నేపథ్యం లో ఆయన్ను సస్పెన్షన్లో వుంచాలని సిఫారసు చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ఆస్తానా సీబీఐలో విధి నిర్వహణకు అనర్హుడని, ఆయన్ను సొంత గుజరాత్ కేడర్కు తిప్పి పంపాలని కూడా అలోక్ వర్మ ప్రధాని కార్యాలయానికి సూచించారు. ప్రధాని కార్యాలయానికి నేరుగా సిఫారసు చేయటం అంటే ఇందుకు స్వయంగా ప్రధాని బాధ్యత వహించాల్సి వుండటంతో ఇది ప్రాధాన్యతను సంతరించుకుంది. వర్మ ఈ అంశాన్ని ఒకటికి రెండు సార్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
తొలుత ఆదివారం సాయంత్రం జరిగిన భేటీలో, మరోసారి సోమవారం ఉదయం రాసిన లేఖలో... ఆస్తానా వ్యవహార శైలితో అంటు వ్యాధిలా వ్యాపిస్తున్న అవినీతి సీబీఐతో పాటు క్యాబినెట్ సెక్రెటేరియట్లో భాగమైన రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా)ను కూడా కబళిస్తుందని వర్మ ప్రధానిని హెచ్చరించారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ని సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (డీఓపీటీ) నేరుగా ప్రధాని కార్యాలయ పర్యవేక్షణలో వుండటంతో ఈ సిఫార్సు ప్రధాని స్థాయిలోనే నిలిచిపోయింది. జనవరిలో పదవీ విర మణ చేయనున్న అలోక్ వర్మ స్థానంలో ఆస్తానా సీబీఐ అధి పతిగా బాధ్యతలు చేపట్టాల్సి వుంది. వాస్తవానికి వర్మ సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టటానికి ముందు అస్తానా కొద్ది నెలల పాటు సీబీఐ డైరెక్టర్గా వ్యవహరించారు. కాగా హైదరాబాద్కుచెందిన వ్యాపార వేత్త సానా సతీష్బాబు నుండి అందిన ఫిర్యాదు నేపథ్యంలో సీబీఐ అనూహ్య రీతిలో ఆస్తానాపై ఈ నెల 15న అవినీతి కేసు నమోదు చేసింది. ఇప్పటికే అరెస్టయిన దుబారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ మనోజ్ ప్రసాద్ కూడా ఈ కేసులో మరో నిందితుడు కావటం విశేషం. సానా సతీష్బాబు నుండి రు.3 కోట్ల లంచం తీసుకున్న ఆరోపణలపై సీబీఐ తన డిఎస్పీ దేవేందర్ కుమార్ను సోమవారం అరెస్ట్ చేసింది. సీబీఐలో చోటుచేసుకున్న ఈ వివాదం కేంద్రంలో పోటెత్తిన అవినీతిని, మోడీ సర్కారు ప్రచారం చేసుకుంటున్న సుపరిపాలనలోని డొల్లతనాన్ని బయటపెడుతోందని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తు న్నాయి. అవినీతి కేసులో ఆస్తానా అరెస్టయ్యే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో విజరుమాల్యా, అగస్టా వెస్ట్లాండ్ వంటి కేసుల్లో ఆయన ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. సీబీఐ పనితీరులో రాజ్యాంగేతర శక్తుల జోక్యాన్ని వర్మ ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తుండే వారని ఆ సంస్థ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆస్తానా మాత్రం సిబిఐని 'గుజరాత్ మోడల్'లో తీర్చిదిద్దాలంటున్న సీనియర్ అధికారులతో కలిసి పని చేయటాన్ని ఆస్వాదించే వారని తెలుస్తోంది. ప్రస్తుత వివాదంలో ప్రధాన సారాంశం ఇదే. ఈ వివాదంలో తటస్థ వైఖరిని అనుసరించాల్సిన ప్రధాని కార్యాలయం కూడా ఏకపక్షంగా ఆస్తానాను సమర్ధిస్తుం డటంతో ఇతర అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. ఈ వివాదాలన్నీ గుజరాత్ రాజకీయాల తరహాలోనే వుంటున్నాయని సీబీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వివాదాలు కేవలం సీబీఐకి మాత్రమే పరిమితం కాలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, రా వంటి సంస్థలు కూడా ఈ వివాదాలలో చిక్కుకుంటున్నాయి.