Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జనరల్ బోగీల్లో రైల్వే టికెట్ కొనుగోలు కష్టాలు తీరనున్నాయి. గంటల పాటు క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యాన్ని రైల్వే శాఖ అందిస్తున్నది. నవంబరు 1 నుంచి ఈ సదుపాయాన్ని ప్రయాణికులు పొందవచ్చని రైల్వేశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు జనరల్ టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ విధానాన్ని నాలుగేండ్ల కిందటే తెచ్చినా..ఆదరణ పొందలేదు. మొదట ఈ విధానాన్ని ముంబయిలో అమలు చేశారు. కానీ అక్కడ లోకల్ రైళ్ల ప్రయాణికులే వాళ్లే ఎక్కువగా ఉండటం వల్ల ఈ పథకం విఫలమైంది. ఆతర్వాత ఢిల్లీ, చెన్నై నగరాల్లోనూ ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వేలోని 15 జోన్లలో ఈ విధానం అందుబాటులో ఉన్నది. ఇక నుంచి దేశవ్యాప్తంగా నవంబరు 1వ తేదీ నుంచి అన్ని ప్రాంతాల ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు కూడా యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూటీఎస్ మొబైల్ యాప్ను మరింత మంది ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు అధికారులు వివరించారు.