Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోం బంద్ ఉద్రిక్తం
గువహతి: పొరుగు దేశాల నుంచి అసోంకు వస్తున్న హిందువులకు పౌరసత్వం కల్పించే 'సిటిజన్షిప్ బిల్లు'కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఊపందుకున్నాయి. దీని లో భాగంగా ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలు సంఘా లూ 12గంటల రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్ఘాన్ నుంచి వచ్చే హిందువులకు అసోం పౌరసత్వం కల్పించే సిటిజన్షిప్ (అమెండ్మెంట్) బిల్లు, 2016 ను అమలు చేయొద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన అసోం గణ పరిషత్ (ఎజీపీ), ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు రాష్ట్రంలోని 46 సంఘాలు ఈ బంద్ను పాటించాయి. బంద్ సందర్భంగా నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. టైర్లు తగులబెట్టి అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నా రన్న వార్తలతో అప్రమత్తమైన ఆందోళనకారులు.. ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు ఈ ప్రయత్నాన్ని విరమించుకోకుంటే ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని ఎజీపీ హెచ్చరించింది. బిల్లుకు ఆమోదం తెలిపితే అసోంలో వలసవాదులకు తలుపులు తెరిచినట్లే అవుతుందని, దీని వల్ల స్థానికులకు తీవ్ర నష్టం కలుగుతోందని ఆ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా నల్బరీ, శివ్సాగర్, జగిరోడ్, గోల్పర, మంగల్డోరు, తేజ్పూర్, జొర్హట్, గోల్గట్లలో రోడ్లమీదకు దూసుకువచ్చిన నిరసనకారులు.. పలుచోట్ల షాపులను బలవంతంగా మూయించారు. కలియాబర్, అంగురిలలో రైళ్లను అడ్డుకున్నారు. వేర్వేరు ఘటనల్లో పోలీసులు దాదాపు వంద మందిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా, దేశంలో వలస వాదులు ఏమూలన ఉన్నా వెతికి పట్టుకుని వారిని భారత్ నుంచి పంపిస్తామని చెబుతున్న బీజేపీ నాయకులు.. ఈ విషయంలో మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం.