Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ సచివాలయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయి మొదలుకుని రాష్ట్రస్థాయి వరకు పాలన కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలే కాక..ఆ రాష్ట్రానికి అవసరమైన కీలక నిర్ణయాలు అక్కడి పాలకులు తీసుకుంటారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్కు ఓ ఐడియా వచ్చింది. రాష్ట్రాల అధికారాలను బీజేపీ గుప్పెట్లోకి తీసుకొచ్చేలా కేంద్రీయ సచివాలయాల (సెంట్రల్ సెక్రెటేరియట్స్)ను తెరపైకి తెచ్చేలా అడుగులేస్తున్నది. ఎన్డీఏ సర్కారు యోచనను ఆయా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సెంట్రల్ సెక్రెటేరియట్లను నెలకొల్పాలనే ఆలోచన రాష్ట్రాల హక్కుల్ని హరించటమేనని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రాలపై ఆధిపత్యం చెలాయించేందుకు కేంద్రం సరికొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టింది. అన్ని రాష్ట్రాల రాజధానుల్లో కేంద్రీయ సచివాలయాలను ఏర్పాటు చేయాలని తలచింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. కేంద్రీయ సచివాలయాల ఏర్పాటు కోసం స్థలాలను అన్వేషించాల్సిందిగా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(సీపీడబ్ల్యూడీ)కు మోడీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వివిధ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రస్థాయి ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడం, కేంద్ర పథకాల అమలు తీరును సమీక్షించడం కోసం ఈ కార్యాల యాలను వినియోగించుకోనున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబు తున్నాయి. అంతేకాక.. రాష్ట్రాల్లో ఉన్న కేంద్ర కార్యాల యాల్లో సమావేశాలు ఏర్పాట్లు చేసుకునేందుకు సరిపడినం త స్థలం, వసతులు లేవన్నది ప్రభుత్వం నుంచి వస్తున్న మరో వాదన. సచివాలయాల కోసం స్థలాల సేకరణకు సంబంధించిన మార్గదర్శకాలను సీపీడబ్ల్యూడీ.. అడిషనల్ డైరెక్టర్ జనరల్స్కు ఇప్పటికే అందించింది. కాగా.. కొత్త సచివాలయాల కేంద్రంగా రాష్ట్రాలను తమ గుప్పిట్లో ఉంచుకొని రాజకీయ లబ్ది పొందాలని మోడీ సర్కారు కుట్రలు పన్నుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రాల్లో కేంద్రీయ సచివాలయాల ఏర్పాటు అనేది రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తున్నాయి.