Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్/న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కల్లోలిత జమ్మూ కాశ్మీర్లో మంగళవారం పర్యటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ప్రత్యేకించి భారత్-పాక్ సరిహద్దు పొడవున నెలకొన్న పరిస్థితులపై సమీక్షించినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రం లో చేపట్టిన కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలపై కూడా సమీక్షించినట్లు రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. భద్రతపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడమేకాకుండా కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. రాజభవన్లో గవర్నర్ సత్యపాల్ మాలిక్తో తొలుత భేటీ అయిన రాజ్నాథ్ ప్రభుత్వంలోని పలువురు సీనియర్ అధికారులతో కూడా సమావేశమయ్యారు. రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించిన తరువాత రాజ్నాథ్ సింగ్జరిపిన తొలి పర్యటన ఇది.